మహేష్ కన్నా ముందే సామ్ వచ్చేలా ఉందే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పలు భారీ సినిమాలతో పాటుగా తన మరో గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” లో కూడా చాలా బిజీ బిజీగా చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు నాలుగు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ గ్రాండ్ షో లో ఎప్పటికప్పుడు పలువురు సినీ తారలు కూడా స్పెషల్ గెస్టులుగా వస్తున్నారు. అయితే ఈ షోకి గాను లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ అలాగే సమంతలు కూడా హాజరు అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇద్దరికీ రెండు ఎపిసోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిపోయాయి. అయితే మరి మహేష్ తో గ్రాండ్ ఎపిసోడ్ ని ఎప్పుడో కంప్లీట్ చేశారు కానీ దాని ప్రోమో ఇంకా బయటకి రాలేదు కానీ జస్ట్ కొన్ని రోజులు కితమే వెళ్లిన సామ్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ ప్రోమోని యాజమాన్యం రిలీజ్ చేసేసారు. సో దీనిని బట్టి మహేష్ ఎపిసోడ్ కన్నా సమంతా ఎపిసోడ్ నే ముందు వచ్చేసేలా ఉందని చెప్పాలి. మరి ఈ ఎపిసోడ్ లో సామ్ 25 లక్షల భారీ మొత్తం గెలుచుకున్న సంగతి తెలిసిందే.