Pahalgam Terror Attack: పహల్గాం టెర్రర్ అటాక్… సాయి పల్లవిని ఏకిపారేస్తున్న నెటిజన్స్?

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఎంతోమందిని కలిచివేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అప్పుడే పెళ్లయిన కొత్త జంట సరదాగా అక్కడికి వెళ్లి తమ జీవితంలో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చకుందామని వెళ్లిన వారికి విషాదకరంగా మిగిలిపోయాయి. ఇలా ఎంతోమంది అర్ధనాథాలతో పహల్గాం గుండె బరువెక్కింది.

ఇప్పటికే ప్రధానమంత్రి, ఆమిత్ షా ఘాటుగా స్పందిస్తూ ఉగ్రవాదులను హతమార్చే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి తరుణంలోనే సినీనటి సాయి పల్లవిని సైతం సోషల్ మీడియా వేదికగా నేటిజన్ లు తీవ్ర స్థాయిలో ఏకిపారేస్తున్నారు.

సినీనటి సాయి పల్లవి గతంలో ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ… మన ఇండియన్స్ పాకిస్తాన్ ఆర్మీని ఉగ్రవాదులుగా చూస్తారు అలాగే పాకిస్తానీ ఆర్మీ మన ఇండియన్స్ ఉగ్రవాదులుగా చూస్తారు. ఇదే హింసకు కారణం అవుతుంది. మనం ఆలోచించే విధానం అలాంటిది అంటూ ఇవే మాట్లాడారు అయితే ఈమె మాట్లాడిన మాటలలో తప్పు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ వీడియోలను మరోసారి వైరల్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీకు నోరు ఎలా వచ్చింది కనీసం బుర్ర ఉండి మాట్లాడవా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ ఘటనపై ఎంతో మంది స్పందిస్తూ…హిందు, ముస్లింలు ఐక్యంగా ఉంటే ఇలాంటి ఘటనలు పునారవృతం కావని.. అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచిస్తున్నారు. మనలో మనం కొట్టుకుని చావకూడదని చెప్తున్నారు. కొందరు కేంద్రాన్ని తప్పుబడుతున్నారు.