క్యాష్ షో లో పవన్ కళ్యాణ్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి..!

సహజ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ.. ఇప్పుడున్న హీరోయిన్లకి భిన్నంగా ఉంటోంది.

ప్రస్తుతం సాయి పల్లవి రానా సరసన విరాటపర్వం సినిమాలో నటించింది. ఇటీవల ఆమె నటించిన శ్యామ్ సింగరాయి సినిమా మంచి విజయం అందుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. విరాట పర్వం సినీమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిపల్లవి అనేక టీవీ షోలకు ఇంటర్వ్యూ లకి హాజరవుతూ సినిమాల గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకుంటోంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విరాటపర్వం టీం తాజాగా క్యాష్ షో లో సందడి చేశారు. ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో గత కొన్ని సంవత్సరాలుగా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో లో సాయి పల్లవి, నవీన్ చంద్ర, డైరెక్టర్ వేణు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు. ఈ షోలో సాయి పల్లవి సుమ మీద పంచులు వేస్తూ సందడి చేసింది. అంతే కాకుండా ఈ షో లో సాయి పల్లవి తన డాన్సుతో అదరగొట్టింది. ఇదిలా ఉండగా ఈ షో ద్వారా సాయి పల్లవి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది. సాయి పల్లవి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ హీరో అయినప్పటికీ ఆయన అలా కనిపించారు. ఒక సాధారణ వ్యక్తి లాగా ఎప్పుడూ అందరికీ కలిసి మెలసి ఉంటూ.. మనసులో ఏం అనిపిస్తే అది చెప్తారు. అందుకే నాకూ ఆయన అంటే చాలా ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.