తాను నటించిన సినిమా ప్లాప్ అయినందుకు రెమ్యూనరేషన్ వద్దన్న సాయి పల్లవి..!

సహజ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట మలయాళం సినిమాతో హీరోయిన్ గా మారిన సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగులో సాయిపల్లవి నటించిన మొదటి సినిమా లోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఫిదా సినిమా సూపర్ హిట్ అవటంతో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అంటి భాషలలో సాయి పల్లవి కి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగు తమిళ్ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం సినిమాలో నటించింది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరో దగ్గుబాటి రానా సరసన నటించింది. ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా రవన్న ప్రధాన పాత్రలో నటించగా.. సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించింది. యదార్థ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి, రానా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ టీవీ షోలలో కూడా సందడి చేస్తున్నారు. తాజాగా సాయి పల్లవి ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ క్రమంలో సాయి పల్లవి సినిమా విషయాలతోపాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సాయిపల్లవి నటించిన పడి పడి లేచే వయసు అనే సినిమా ప్లాప్ అయింది. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోవడానికి సాయిపల్లవి నిరాకరించింది. కానీ ప్రొడ్యూసర్ కొంత కాలం తరువాత పట్టుబట్టి మరీ సాయి పల్లవికి రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు సాయి పల్లవి ఉదార స్వభావం చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.