తన సంచలన కామెంట్స్ పై డీసెంట్ గా క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి.!

తాజాగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన స్టార్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది సాయి పల్లవి అని చెప్పాలి. లేడీ పవర్ స్టార్ అంటూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా గత వారం నుంచి వినిపిస్తుండగా.. హీరోయిన్ గా నటించిన చిత్రం “విరాట పర్వం” కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా టాపిక్ వచ్చినపుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి పల్లవి చాలా ఎక్కువగానే యాక్టీవ్ గా పాల్గొనగా ఈ ప్రమోషన్స్ లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం లేపాయి. 

దీనితో చాలా మంది ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశారు అలాగే కొంతమంది అండగా నిలిచారు. అయితే ఇది మరింత ఎక్కువగా వ్యాప్తి చెందకూడదు అని ఫస్ట్ టైం సాయి పల్లవి తన సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఇలా నేను ఒక అంశంపై క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది అనుకోలేదని అయినా ఆరోజు అసలు ఏం జరిగింది? నేనేం చెప్పాలి అనుకున్నాను? అది వేరేగా ఎందుకు వెళ్లిందో వివరించింది. 

మొదటగా తాను ఈ మతాలు, ప్రాంతాలు అనేవి పక్కన పెడితే తన తోటి వారిని ఎప్పుడు “మనుషులు” గానే చూస్తానని ఆ తర్వాతే వేరే ఏవైనా అని తెలిపింది. అయితే ప్రమోషన్స్ లో నన్ను అడిగినప్పుడు మీరు లెఫ్ట్ లో ఉంటారా రైట్ లో ఉంటారా అని అడిగినపుడు నేను న్యూట్రల్ గా ఉంటానని చెప్పానని కానీ అది అనేక మాధ్యమాల్లో వేరే విధంగా తీసుకెళ్తున్నారు అందుకే నేను ఇపుడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది అని తెలిపింది. 

అలాగే కాశ్మిర్ ఫైల్స్ సినిమా వచ్చాక నేను డైరెక్టర్ తో మాట్లాడే అవకాశం వచ్చినపుడు ఒక మూడు నెలల కితం మాట్లాడానని సినిమాలో చూపించిన మరణ కాండ అంతా నేను చూడలేకపోయానని చెప్పింది. అలాగే తప్పు ఇలాంటి హింస ఏ మతంలో చేసిన ఏ మతం వారు చేసిన అది తప్పే అవుతుంది మాహా పాపం కూడా అని చెప్పింది. 

నేను ఈ రకంగా చెప్తే అది వేరేలా వెళ్ళింది అని నేను ఎవరినీ తక్కువ చెయ్యలేదు అలాగని సపోర్ట్ కూడా చెయ్యలేదు కేవలం న్యూట్రల్ గా మాత్రమే ఉన్నాను ఈ సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హార్ట్ ఫుల్ థాంక్స్ చెప్తున్నానని సాయి పల్లవి నవ్వుతు డీసెంట్ క్లారిటీ ఇచ్చింది.