ఆ టీవీ ఛానల్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన రోజా..

వైఎస్ఆర్ సీపీ మంత్రి రోజా టీవీ ఫైవ్ ఛానల్ పై బాగా ఫైర్ అయ్యింది. టీవీ5 ఓ పచ్చ ఛానెల్ ఇవ్వాళ ఏ న్యూస్ లేక దిగజారిపోయి ప్రచారం చేస్తుందని అన్నారు. వైయస్సార్ వాహన పథకంలో ట్రాక్టర్ కార్యక్రమం చేపడితే.. ఎప్పటిదో టీడీపి సభను వేసారు అని అన్నారు.

ఇక తిరుపతిలో మంత్రి హోదాలో మహా ద్వారం నుండి తానొక్కతే వెళితే తన గన్ మెన్ కూడా వచ్చారు అని స్క్రోలింగ్ చేశారు అంటూ.. ఇదే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు. పైసల కోసం బాబు భజన చేసుకో టీవీ ఫైవ్ ఛానల్ అంటూ.. ఎదుటివాళ్ళ మీద బురద చల్లకు.. తిరిగి అది నీ మీదే పడుతుందని విమర్శలు చేశారు.