నాగర్‌కర్నూర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నాగర్‌ కర్నూల్‌ జిల్లా చారగొండ మండలంలో ఘోరా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుర్కలపల్లి వద్ద కారు రోడ్డు పక్కనున్న దిమ్మెను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు స్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఆష్పత్రికి తరలించారు. మితిమిరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.