Crime: దారుణం.. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..?

Crime: తాజాగా ములుగు జిల్లా లోని ఎర్రగట్టమ్మ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆటోను డీసీఎం వ్యాను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరొక నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో మృతి చెందిన వారు మంగంపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు. మృతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అజయ్(12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటోడ్రైవర్ జానీ (23) గా గుర్తించారు. వీరందరూ కూడా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గా కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణ చేశారు. మృతుల వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.