Crime: మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..?

Crime: ఈ మధ్యకాలంలో రోడ్డు యాక్సిడెంట్ లు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకు కొన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలకు కేవలం సాధారణ వ్యక్తులే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం గురవుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం అతివేగం. నిత్యం ఎన్నో దేశాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రజలలో మార్పు రావడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా మేడ్చెల్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రోజు రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు డివైడర్ పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కారులో మొత్తం తొమ్మిది మంది ఉండగా అందులో ఇద్దరు మృతి చెందగా మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.