Riddi Kumar: ఆ ముగ్గురు హీరోలతో నటించాలని ఉంది: నటి రిద్ది కుమార్

Riddi Kumar: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా మార్చి 11 న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నటి రిద్ది కుమార్ స్పోర్ట్స్ ఉమెన్స్ క్యారెక్టర్ లో నటించింది. అయితే ఈ పాత చేయడం చాలా కష్టం, ఇది కాకుండా ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆర్చరీ కూడా నేర్చుకున్నాను అని అంటోంది నటి రిద్ది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి రిద్ది మీడియాతో మాట్లాడుతూ.. మొదట తెలుగులో లవర్స్, అనగనగా ఓ ప్రేమకథ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.

అంతేకాకుండా ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్రను చేశాను అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ మే నెలలో రిలీజ్ కానుంది అని తెలిపింది. అలాగే తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో నటించాలి అని ఉంది అంటూ తన మనసులోని మాటను బయట పెట్టేసింది నటి రిద్ది కుమార్. రిద్ది కుమార్ తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్.