జూబ్లీహిల్స్ ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదంటూ!

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా జూబ్లీహిల్స్ లో జరిగిన అత్యాచారం ఘటనపై స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేదని మండిపడ్డారు. కనీసం ఇప్పటి వరకు ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయలేదు అని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించాలి అని గట్టిగా వాదించారు.

ఇప్పటికే భాజాపా, బీజేవైఎం శ్రేణులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించి అక్కడ బాగా ఆందోళన వ్యక్తం చేశారు. హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ విషయం గురించి కేసీఆర్ ఏమని స్పందిస్తాడో చూడాలి.