బీజేపీ, టిఆర్ఎస్ పంచాయతిలను అత్త కోడలితో పోల్చిన రేవంత్ రెడ్డి..

టీపీసీసీ రేవంత్ రెడ్డి తాజాగా మీడియా సమావేశం కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీలను అత్తా కోడలి పంచాయతీ తో పోల్చారు. ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని.. వాళ్లు వేరు అని మనం ఎప్పుడు అనుకోవద్దు అని అన్నారు. ఏ విషయంలో వాళ్ళు విడిపోయారు అని ప్రశ్నించారు.

కేసీఆర్ అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడని బీజేపీని వ్యాఖ్యలు చేసిందని అన్నారు. నాలుగువేల కోట్ల అప్పులకు అనుమతి ఇచ్చింది ఆ పార్టీనే కదా అని అన్నారు. ఇక ప్రజలంతా ఆక్టివ్ గవర్నమెంట్ కోరుకుంటున్నారు కానీ అది తెలంగాణలో లేదని అన్నారు. ఇక వరుస సంఘటనలు జరుగుతున్నా కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు అని ఫైర్ అయ్యారు.