Hanuman sobhayatralo: ఢిల్లీలో హనుమాన్ శోభయాత్రలో మత ఘర్షణలు.. ఏకంగా రాళ్లతో దాడి!

Hanuman sobhayatralo: నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి చోటా హనుమాన్ శోభాయాత్ర వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా ఢిల్లీలో జహంగీర్ పురిలో నిన్న సాయంత్రం హనుమాన్ శోభయాత్ర జరుగుతున్న సమయంలో.. మరో వర్గంకు చెందిన వాళ్ళు శోభాయాత్ర పై రాళ్ల దాడి చేశారు.

దీంతో అవతలి వర్గం వారికి కోపం రావటం తో ఇరువర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసుల సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు. ఇక ఈ ఘటనకు ముఖ్య కారకులైన ఐదుగురు తో సహా 14 మంది అరెస్టు చేయగా ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో ఉన్నారు.