Prabhas – Mahesh Babu: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్ మహేష్ !

Prabhas – Mahesh Babu: రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.బాహుబలి తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చింది, ఈ సినిమాకు ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాధేశ్యామ్ సినిమా హిందీ వెర్షన్ కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. రాధేశ్యామ్ తెలుగు వెర్షన్ కమహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారు అని చిత్ర పరిశ్రమలో ఇన్సైడ్ టాక్. ఇటీవల ఏపీ సీఎం జగన్ కలవడానికి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వెళ్లినప్పుడు మహేష్ ప్రభాస్ ను ఒక స్క్రీన్ మీద నవ్వుతూ మాట్లాడుకోవడం చూసే ప్రేక్షకులు సంబరం చేసుకున్నారు. అందులోనూ మహేష్ గతంలో కూడా కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమాకు, పవర్ స్టార్ జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరో ఇంకొక హీరో సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు, ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్, మహేష్ ,రానా, నాని, సునీల్ మొదలైన వారు సినిమాలకు ఎవరిచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు ప్రభాస్ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు తెలియడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వాయిస్ ఓవర్ ఏ కాకుండా క్లైమాక్స్ లో కూడా మహేష్ బాబు వాయిస్ ఉంటుందని సమాచారం. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి.