50 ఏళ్లు వచ్చినా పెళ్లికి దూరంగా ఉన్న సినీ నటీమణులు వీళ్లే?

సినిమా రంగానికి చెందిన నటీమణులు ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, నిక్కీ గల్రానీ మరికొందరు సినీ ప్రముఖులు ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతమంది నటీమణులు మాత్రం 50 సంవత్సరాల వయస్సు వచ్చినా పెళ్లికి దూరంగా ఉన్నారు. ఈ నటీమణుల పెళ్లి గురించి జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీమణులు పెళ్లికి దూరంగా ఉన్నారు. అలా పెళ్లికి దూరంగా ఉన్న ప్రముఖ నటీమణులలో సితార ఒకరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం తల్లి పాత్రలలో నటిస్తున్న ఈ నటి పెళ్లికి దూరంగా ఉన్నారు. లవ్ ఫెయిల్యూర్ కావడం వల్లే సితార పెళ్లికి దూరంగా ఉన్నారని చాఅలామంది భావిస్తున్నారు. కోలీవుడ్ నటుడిని ప్రేమించడం వల్ల ఈమె పెళ్లికి దూరంగా ఉందని బోగట్టా.

మరో నటి నిర్మల తెలుగులో వేర్వేరు పాత్రల్లో నటించి తన నటనతో మెప్పించారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో ప్రేమాయణం వల్లే ఈ నటి పెళ్లి దూరంగా ఉన్నారని సమాచారం అందుతోంది. ముత్యాల ముగ్గు సంగీత కూడా ఎంజీఆర్ వల్లే పెళ్లికి దూరంగా ఉన్నారని సమాచారం. అన్ని భాషల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్న టబు కూడా పెళ్లికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

నగ్మా, శోభన, అమీషా పటేల్ కూడా పెళ్లికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. బుల్లితెర సీరియళ్ల ద్వారా, సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న రజిత, రాగిణి సైతం పెళ్లికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ నటీమణులు పెళ్లికి దూరంగా ఉండటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ హీరోయిన్లు పెళ్లికి దూరంగా ఉండటంతో ఈ హీరోయిన్ల అభిమానులు ఫీలవుతున్నారు.