చిరంజీవి సినిమా వల్లే త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ విడిపోయారా.. ఏం జరిగిందంటే?

సినిమా రంగంలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న కాంబినేషన్లలో త్రివిక్రమ్ విజయ్ భాస్కర్ కాంబినేషన్ ఒకటి. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘనవిజయం సాధించాయి. అయితే ఒక ఫ్లాప్ సినిమా ఈ కాంబినేషన్ విడిపోవడానికి కారణమైంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన జై చిరంజీవ సినిమా ఈ అద్భుతమైన కాంబినేషన్ ను విడగొట్టింది. 2005 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించగా నిర్మాతగా అశ్వనీదత్ కు ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ విడిపోయిన తర్వాత త్రివిక్రమ్ అంతకంతకూ ఎదుగుతూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తుండగా విజయ్ భాస్కర్ మాత్రం వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.

జై చిరంజీవ సినిమా ఒకవేళ సక్సెస్ సాధించి ఉంటే మాత్రం ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు అయితే వచ్చి ఉండేది. ఏ నిర్మాత, ఏ స్టార్ హీరో త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ లను కలిపే ప్రయత్నం చేసి ఉన్నా మరికొన్ని సంవత్సరాల పాటు ఈ కాంబినేషన్ కొనసాగి ఉండేది. మసాలా సినిమా విజయ్ భాస్కర్ డైరెక్షన్ చేసిన చివరి సినిమా కాగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ భాస్కర్ కు ఎక్కువగా ఆఫర్లు రాలేదు.

విజయ్ భాస్కర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. త్రివిక్రమ్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ తర్వాత సినిమాలతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రేంజ్ పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.