Balakrishana- Raviteja: పని పాటలేని డాష్ నాకొడుకులు అంటూ బాలయ్య టాక్ షోలో రెచ్చిపోయిన రవితేజ..!

Balakrishana- Raviteja: నందమూరి బాలకృష్ణ వెండితెరపై వరుస సినిమాలతో దూసుకుపోవడం కాకుండా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ దూసుకు తీసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఇది వరకే ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ,నాని,బ్రహ్మానందం, రాజమౌళి వంటి తదితరులు పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి మాస్ మహారాజ రవితేజ వచ్చినట్లు నిర్వాహకుల ప్రోమోను విడుదల చేశారు.

గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో బాలకృష్ణ రవితేజ మధ్య ఎన్నో మనస్పర్ధలు వివాదాలు ఉన్నాయని అందుకే వీరిద్దరూ ఒకే వేదికపై ఎప్పుడు కనిపించలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలకు ఈ కార్యక్రమం చెక్ పెట్టిందని చెప్పాలి. ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ ముందుగా బాలకృష్ణ ఒక ఒక ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన తరువాత కార్యక్రమం మొదలు పెడతామంటూ నీకు నాకు మధ్య పెద్ద గొడవలు ఉన్నాయి కదా అవి ఏంటి అని అడిగారు. ఇక బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు రవితేజ తనదైన శైలిలో సమాధానం చెప్పి అందరి నోళ్ళు మూయించారు.

ఎలాంటి పని పాట లేని డాష్ నా గాళ్లకు ఇలాంటి పని అంటూ వారి ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్థలు లేవని పరోక్షంగా వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సైతం వచ్చారు. ఈ ముగ్గురు కలిసి ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించబోతున్నారని ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీరి మధ్య జరిగిన సంభాషణలు తెలియాలంటే ఈ కార్యక్రమం ఎపిసోడ్ అయ్యే వరకు వేచి చూడాలి.