Rashmika Mandanna : పాపం వారి కోసం రష్మికా మందన్నా ఎమోషనల్ పోస్ట్.. ఇంతకీ ఏం జరిగిందంటే

Rashmika Mandanna : నిన్ననే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకులు సుకుమార్ తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప పార్ట్ 1” ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుకకి గాను సినిమా హీరోయిన్ శ్రీవల్లి రష్మికా మందన్నా కూడా వచ్చింది. వచ్చి స్టేజ్ పై పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.

అంతేనా లైవ్ లోనే అల్లు అర్జున్ కి ప్రపోజ్ కూడా చేసి షాక్ ఇచ్చింది. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఆమె ఒక పోస్ట్ పెట్టడం వైరల్ అవుతుంది. నిన్న ఫంక్షన్ కి వచ్చిన అందరికీ థాంక్స్ అని అంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది అని తెలిపింది.

కానీ ఇదే వేడుకకి వచ్చిన కొంతమంది అభిమానులు గాయపడ్డారని విషయం నా దృష్టికి వచ్చింది అని ఈ వార్త మాత్రం చాలా బాధగా అనిపించింది అని రష్మికా మందన్నా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.