రష్మీ ఎప్పటికీ నా గుండెలోనే ఉంటుంది.. ఏమోషనల్ అయిన సుధీర్!

బుల్లితెర క్రేజీ జోడిగా ఎంతో పేరు సంపాదించుకున్న రష్మి సుడిగాలి సుధీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట ఎన్నో టీవీ షోలలో స్పెషల్ ఫర్ఫార్మెన్స్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ విధంగా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా వర్కౌట్ అయిన వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలను క్యాష్ చేసుకుని ఈవెంట్ నిర్వాహకులు వీరి చేత ఎన్నో స్కిట్ లు చేయించేవారు.

ఇలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మి సుదీర్ నిజజీవితంలో కూడా ఒకటైతే బాగుండని చాలామంది భావించారు. అయితే వీరిద్దరూ కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ సమాధానం చెప్పారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందిన సుధీర్ ప్రస్తుతం ఈటీవీ నుంచి దూరం అయ్యి మాటీవీ జీ టీవీలో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జీ టీవీలో ప్రసారమవుతున్న దిల్ సే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా సుధీర్ రష్మీని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా కొందరు సుధీర్ అభిమానులు వేదిక పైకి వచ్చారు. ఈ క్రమంలోనే 17 సంవత్సరాల కుర్రాడు సుధీర్ ని బాబాయ్ అని పిలుస్తూ.. బాబాయ్ రష్మీ పిన్ని ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. ఇలా కుర్రాడు అడగడంతో సుధీర్ రష్మీ మీకు కనిపించకుండా నా గుండెల్లో ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా రష్మీ గురించి సుదీర్ ఈ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం అవుతున్నాయి.