దింపుతా అంటూ కమెడియన్లకు వార్నింగ్ ఇచ్చిన రష్మీ.. రష్మిలో యాంగిల్ కూడా ఉందా?

ప్రస్తుతం రష్మీ మకుటుం లేని మహారాణిగా ఈటీవీ కార్యక్రమాలకు ఏకచత్రాధిపత్యం వహిస్తూ అన్ని కార్యక్రమాలను ఏలేస్తుంది.కేవలం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా ఉండే రష్మీ సుధీర్ ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని కూడా రష్మీ హ్యాండిల్ చేస్తుంది. ప్రస్తుతం అనసూయ వెళ్లిపోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే కేవలం కొద్ది రోజులు మాత్రమే రష్మీ జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతారని తెలుస్తోంది.

జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన అనంతరం ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ కొత్త యాంకర్ దొరికే వరకు మాత్రమే నన్ను భరించండి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే ఇప్పట్లో ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ రారని అర్థమవుతుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా రష్మీ కమెడియన్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

ఈ ప్రోమోలో భాగంగా గాలి పటాల సుధాకర్ టీం నుంచి కమెడియన్ రష్మి పై సెటైర్లు వేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రశ్మి వంక చూస్తూ ఎవరు ఈమె విస్కీ నా? రమ్మా అంటూ మాట్లాడటమే కాకుండా తనని చూస్తే మత్తెక్కిపోతుంది అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే మరొక కమెడియన్ ఒకసారి దగ్గరకు వెళ్లి చూడు దిగిపోతుంది అంటూ చెప్పగా వెంటనే రష్మీ దింపుతా అంటూ వేలు చూపిస్తూ వారిద్దరికీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.