Rashmi Gautham: అలా చేయటం కుడా రేప్ తో సమానం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మి..!

Rashmi Gautham: ఇండస్ట్రీలో బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి పలు టీవీ షోలలో సందడి చేస్తూ ఉంటుంది. ఇక సుధీర్ కి జోడీ గా పలు టీవి షో లు చేయటం వల్ల వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరిద్దరి జోడి చాలా పాపులర్ అయ్యింది. ప్రశ్న టీవీ షో లు మాత్రమే కాకుండా పలు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.

ఇదిలా ఉండగా రష్మి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను కుడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే మూగ జీవాల పట్ల ఎంతో ప్రేమగా ఉండే రష్మి తరచు వాటి గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ ఉంటుంది. మూగ జీవాల మీద పట్ల జరిగే బలి గురించి తరచు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ.. రోడ్డు మీద గాయపడిన వీధి కుక్కలు వైద్యాన్ని అందిస్తూ.. వాటికి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది.

మూగ జీవాల పట్లఎంతో ప్రేమ చూపించే రష్మి డైరీ పదార్థాలకు ,మాంసాహారానికి దూరంగా ఉంటుంది. ఈ సందర్భంగా రష్మీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ మనం రోజూ తాగే పాల కోసం ఆ జంతువులను డైరీ లో ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో చూడండి అంటూ ఒక వీడియో కూడ షేర్ చేసింది. ఈ వీడియోలో రిప్రొడక్టివ్ కోసం బర్రెలకి సూదులు వేస్తుంటారు. మనకి కావలసిన ఆహారపదార్థాల కోసం మూగ జీవాలను ఇలా హింసించడం కూడా రేప్ తో సమానం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మనలాగే జంతువులకి కూడ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది దయచేసి వాటిని హింసించకండి అంటూ పోస్ట్ చెసింది.