నీ దగ్గర డబ్బుంటే చెప్పు…వచ్చేస్తా అంటున్న రష్మీ

తెలుగు టెలివిషన్ లో ఉన్న హాట్ యాంకర్ లో ఒకరు రష్మీ గౌతమ్. ఒకప్పుడు ‘హోలీ’, ‘కరెంట్’ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన రష్మీ గౌతమ్ టెలివిషన్ యాంకర్  గా బాగా పాపులర్ అయ్యింది. హీరోయిన్ గా ‘అంతం’, ‘గుంటూరు టాకీస్’, ‘అంతకు మించి’ లాంటి సినిమాల్లో నటించినా సక్సెస్ కాలేకపోయింది.

సినిమాల కోసం ఎదురు చూడకుండా తనకు లైఫ్ ఇచ్చిన టెలివిషన్ కె ప్రయారిటీ ఇస్తుంది రష్మీ. రీసెంట్ గా  ఓ నెటిజన్… “ఈ చిల్లర షోలు ఎన్నాళ్ళు చేస్తారు మేడం చక్కగా హీరోయిన్ గా సినిమాలు చేసుకోండి” అని కామెంట్ పెట్టాడు. సదరు కామెంట్ కి స్పందించిన రష్మీ… “నా దగ్గర మంచి కథలు కూడా ఉన్నాయి. నీ దగ్గర డబ్బులుండి, నిర్మాతగా తెరకెక్కిస్తానంటే చెప్పు వచ్చేస్తాను…” అని రిప్లై ఇచ్చారు. నువ్వు ప్రొడ్యూసర్ గా మారితే సినిమాలు చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదని సూటిగా సమాధానం చెప్పింది.

ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా రష్మీ బిజీ గా ఉంది.