Rashmi Gautham: వాళ్ళు అసలు మనుషులేనా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన రష్మి…!

Rashmi Gautham: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా రష్మి మంచి గుర్తింపు పొందింది. బుల్లితెర మీద ప్రసారమౌతున్న షోలకు యాంకర్గా వ్యవహరిస్తూ మరింత పాపులర్ అయ్యింది. రష్మి ఇలా యాంకర్ గా బుల్లితెర మీద మాత్రమే కాకుండా నటిగా సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎన్నో సినిమాలలో కనిపించింది. హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినప్పటికీ అవి పెద్దగా హిట్ అవ్వలేదు. దీంతో పూర్తిగా బుల్లితెరకే పరిమితం అయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ రష్మి తన అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

రష్మి మూగజీవాల పట్ల కూడా ఎంతో ప్రేమగా ఉంటుంది. రోడ్డుమీద ఆహారం లేక తిరుగుతున్న మూగజీవాలకు ఆహారాన్ని అందించటమే కాకుండా గాయపడిన వాటికి చికిత్స చేయిస్తుంది. ముఖ్యంగా కుక్కలంటే రష్మి కి చాలా ఇష్టం. తన ఇంట్లో చాలా పెట్స్ ని కూడా పెంచుకుంటుంది. అయితే మూగ జీవాల పట్ల ఎవరైనా క్రూరంగా ప్రవర్తిస్తే రష్మికి చాలా కోపం వస్తుంది. అలాంటి వ్యక్తుల పట్ల రష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి శిక్ష పడేలా చేస్తుంది.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి దయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కొందరు వ్యక్తులు కలిసి రోడ్డు మీద ఉన్న కుక్కని దారుణంగా కర్రలతో కొట్టి హింసించారు . ఆ వీడియో చూసిన రష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తు.. వీళ్ళు అసలు మనుషులేనా ?
వీళ్ళకి అసలు జాలీ, దయా అనేవి ఏమైన ఉన్నాయా?
వీళ్లు అసలు మనుషులకే పుట్టారా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. అంతే కాకుండా ఈ దుర్మార్గులకు శిక్ష పడే వరకు ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.