Rana Daggubati: ఓటీటీ లో రానా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు తెలుసా?

Rana Daggubati: టాలీవుడ్ యంగ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రానా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. మొదటినుంచి రానా హీరోగా విభిన్న పాత్రల్లో నటిస్తూ విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అడవి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ,హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి బాగానే హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నటించిన మరో సినిమా 1945. ఈ సినిమాకు సత్య శివ దర్శకత్వం వహించగా సి.కళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమాలో హీరో రానా సరసన రెజీనా హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే.

యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. ఇంకా చెప్పాలి అంటే చాలా మందికి ఈ సినిమా గురించి ఐడియానే లేదు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా ఎక్క లేదనే చెప్పవచ్చు. థియేటర్లలో కూడా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను ఓటీటీ లో తీసుకురానున్నారు చిత్రబృందం.

సన్ నెక్స్ట్ లో ఈనెల ఏడవ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే రానా నటించిన విరాటపర్వం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఇందులో రానా నక్సలైట్ గా కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్ర పోషించింది.