ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్టు చేయాలంటున్న రామకృష్ణ..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తాజాగా మీడియా ముందు పాల్గొని కొన్ని విషయాలు బయట పెట్టాడు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణించడంతో ఈ ఘటన బాగా ఉద్రిక్తంగా మారింది. దీంతో నిన్న రాత్రి సుబ్రహ్మణ్యం భార్యను, కుటుంబ సభ్యులను ఒప్పించి పోస్టుమార్టంకు పంపించారు.

దీంతో సుబ్రహ్మణ్యం హత్యనేనని తేలగా ఈరోజు తన సొంత ఊర్లో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయం గురించి రామకృష్ణ మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం హత్యోదంతంపై విజయవాడలో ఈ నెల 23న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్టు చేయాలి అని తెలిపాడు. పైగా సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.