ఒంటరి వాన్ని అయిపోయాను అంటూ అందరిచేత కంటతడి పెట్టించిన రామ్ ప్రసాద్..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ జబర్దస్త్ షో గత తొమ్మిది సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది ప్రాణ స్నేహితులను పొందారు. అలా ఒకరి ఒకరు ప్రాణంగా ఉన్న వారిలో సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి ముగ్గురి మధ్య ఉన్న స్నేహ బంధం ఎంత విలువైనదో అందరికీ తెలిసిన విషయమే.ఎన్నో ఏళ్లుగా ముగ్గురు కలిసి జబర్దస్త్ స్టేజి మీద చేసే సందడికి అభిమానులు అందరూ ఫిదా అయిపోయారు.

కానీ ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా ఎవరి దారిన వారు విడిపోయారు. జబర్దస్త్ నుండి ఎంతో మంది కమెడియన్ల, జడ్జిలు వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో సినిమా అవకాశాలు రావడంతో గెటప్ శీను సుడిగాలి సుదీర్ కూడా జబర్దస్త్ ను విడిచి వెళ్లారు. దీంతో రామ్ ప్రసాద్ మాత్రమే జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సుధీర్ శ్రీను లేకపోవటంతో రాంప్రసాద్ చేసే స్కిట్లలో ఆ లోటు బాగా కనిపిస్తోంది. వారిద్దరూ మళ్లీ జబర్ధస్త్ కి వచ్చి కలిసి స్కిట్ చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఇటీవల జబర్ధస్త్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది ఈ ప్రోమో లో రాకేష్, కార్తీక్ టీమ్ కలిసి సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ ఫ్రెండ్షిప్ గురించి ఓ స్కిట్ చేశారు. ఆ స్కిట్ చేస్తున్నంతసేపు జడ్జ్ లతో పాటు రష్మి , రామ్ ప్రసాద్ సహా అందరు ఎమోషనల్ అయ్యారు. స్కిట్ అయిపోయిన తరువాత ఇంద్రజ మాట్లాడుతూ ఎవరి దిష్టి తగిలిందో ఇలా అయ్యింది అంటూ రామ్ ప్రసాద్ ని దగ్గరికి తీసుకొని ఓదార్చింది. ఇక రామ్ ప్రసాద్ మాట్లాడుతూ నేనూ రైటర్ ని నాకేం పర్వాలేదు అని అనుకున్నా . కాని వాళ్ళు లేకపోవటంతో ఒంటరివాన్ని అయ్యానని ఫీలింగ్ బాధిస్తోంది అంటూ కంట తడి పెట్టుకున్నాడు. దీంతో అక్కడున్న వారందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.