RGV: సమ్మక్క దేవతకు విస్కీని నైవేద్యంగా సమర్పించిన రామ్ గోపాల్ వర్మ…. ఫోటో వైరల్!

RGV: ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషనే. ఆయన చేసే ట్వీట్లకు లక్షల్లో కామెంట్లు.. ఏ సినిమా తీసినా ముందు కాంట్రవర్సీ కావల్సిందే. ఆయనే రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన సినిమా టికెట్ల అంశంపై చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ దేవున్ని నమ్మను అని ఎన్నో లాజిక్‌లు చెప్పే వర్మ ఇప్పుడు పూజలు చేస్తున్నారంటే నిజంగా చెప్పుకోదగిన విషయమే కదా..

ఇక వివరాల్లోకి వెళితే రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీసిన సినిమా కొండా. ఆ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటూ తెలంగాణలో అత్యంత పవిత్రంగా కొలిచే సమ్మక్క సారక్కలకు విస్కీని నైవేద్యంగా సమర్పించారు. దేవుళ్లపై భక్తి లేదంటూ ఆయన ఇలా చేయడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. సెన్సేషన్‌ సృష్టించడం ఆయన అజెండా అయినప్పటికీ.. ఆయన చేసిన ప్రతీ పోస్టులోనూ కొత్తదనంతో పాటు, కాంట్రవర్సీకి కూడా దారి తీయడం గమనార్హం.

ఈ సినిమా ఇంతకు ముందే విడుదల కావాల్సి ఉన్నా కరోనా మూడో వేవ్ వల్ల వాయిదా పడింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగానే ఆయన థియేటర్లలో సినిమా టికెట్ల విషయమై మంత్రి పేర్ని నానిని, సీఎం జగన్‌ను కలిసి హడావిడి చేశారని సమాచారం. కానీ అంతగా ప్రయోజనమేమీ లేకపోయింది. ఆ తర్వాత తాజాగా ఇండస్ట్రీలోని కొందరు సినీ ప్రముఖులు వెళ్లి మళ్లీ సీఎం జగన్‌తో చర్చల్లో పాల్గొని సమస్య పరిష్కారానికి నాంది వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన పోస్ట్ చేసిన ఈ ఫొటోను నిర్మాత బేబీ శ్రేష్ట తీయడంతో, అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.