Rakulpreeth Singh: ప్రియుడితో కలిసి తాజ్ మహల్ కు వెళ్ళిన రకుల్… ఫోటో వైరల్!

Rakulpreeth Singh: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరటం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్ లీ, ధ్రువ వంటి ఎన్నో సినిమాలలో ఎంతో మంది టాప్ హీరోలతో నటించింది. టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ తన ఫొటోలు వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ విధంగా బాలీవుడ్ కి చెందిన జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో పడిన విషయం అభిమానులతో పంచుకుంది. మొదట తన ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచిన రకుల్ కొంతకాలం తర్వాత తానే స్వయంగా అందరితో షేర్ చేసుకుంది. ఈ ప్రేమజంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ జంట ప్రేమకు చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ ను దర్శించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుయి.

ఈ ప్రేమ జంట ఒక వివాహానికి హాజరు కావటానికి ఆగ్రా వచ్చినట్టు సమాచారం.దే దే ప్యార్ దే దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు వచ్చారని సమాచారం. ప్రేమలో మునిగి తేలుతున్న రకుల్ పెళ్లి మాత్రం ఇప్పుడే కాదంటోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీ బిజీగా ఉంది.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రకుల్ తనకూ ,తన సినిమాలకు ,తన ప్రియుడు జాకీ భగ్నానికి సంబంధించిన విషయాలను తన ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కుర్రకారు మనసుల్ని కొల్లగొడుతోంది.