స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి కుటుంబం నుండి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీసింహ. మొదటి సినిమా ‘మత్తు వదలరా’తో హిట్ అందుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాకు రాజమౌళి బ్యాక్ బోన్ అయ్యారు. తమ కుటుంబం నుండి వచ్చిన కుర్రాడిని బాగానే ప్రమోట్ చేసుకున్నారు. సినిమా ప్రమోషన్లకు ఏకంగా ప్రభాస్ ను దింపారు. రాజమౌళి అడగడంతో ప్రభాస్ కాదనకుండా ‘మత్తు వదలరా’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభాస్ రాకతో సినిమా స్థాయి మారిపోయింది. ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కింది. లాభాలు చూసారు నిర్మాతలు.
శ్రీసింహ ఇప్పుడు ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. మార్చి 27న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పుడిప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. త్వరలో రాజమౌళి కూడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఆయన ప్రజెంట్ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. ఇందులో చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. కాబట్టి వారిద్దరిలో ఎవరో ఒకరిని సినిమా ప్రీరిలీజ్ వేడుకకు తీసుకొచ్చే యోచనలో ఉన్నారట ఆయన. మరి ఇద్దరి ఏ హీరో శ్రీసింహ కోసం వస్తారో చూడాలి.