Rajamouli : మన టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ వాయిదా డైలమాలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి కి కరోనా తో పాటుగా ఏపీలో నిర్ణయించిన టికెట్ ధరల అంశం కూడా పెద్ద ఎత్తున తలనొప్పి గా మారింది. దీనితో చాలా కాలం తాను మాట్లాడకపోయినా తాను రీసెంట్ గా ఈ అంశంపై ఓపెన్ అయ్యినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి హాట్ కామెంట్స్ చెయ్యడం జరుగింది. తాను ఈమధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ తో ఏకీభవిస్తున్నానని, నాకు ఈ రాజకీయాల కోసం పెద్దగా తెలియదని, అయితే ఒక ప్రొడక్ట్ ని తయారు చేసినవాడికి ఎలా అయితే దాని ధరను వారు నిర్ణయించుకునే హక్కు ఉంటుందో సినిమా విషయంలో కూడా అంతే అని, ఇది ఇండస్ట్రీలో వ్యక్తి గా నేను చెప్తున్నానని తెలిపాడు.
అలాగే వీటికి మరిన్ని కామెంట్స్ జోడిస్తూ ఒక టిఫిన్ అనేది అన్ని హోటల్స్ లోని ఒకటే ఉండొచ్చు కాని హోటల్ ని బట్టి ధర ఉంటుంది సినిమా కూడా అలాంటిదే అని ధర నచ్చితే సినిమా టికెట్ ప్రేక్షకుడు కొంటాడు లేకపోతే లేదు అని రాజమౌళి తన లాజికల్ వివరణను తెలియజేసారు. దీనితో ఇప్పుడు ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.
