రాజమౌళి కుటుంబంలో మొదటి పరాజయం.. అంతా సీరియస్

Rajamouli family faces first failure

Rajamouli family faces first failure

రాజమౌళి అంటేనే విజయానికి కేరాఫ్ అడ్రెస్. ఆయన చేసిన సినిమా ఏదీ కూడ ఫ్లాప్ కాలేదు. కెరీర్ ఆరంభం నుండి హిట్ స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నారే తప్ప ఎక్కడా తగ్గింది లేదు. ఇక ఆయన పెద్దన్న కీరవాణి గురించి చెప్పనక్కర్లేదు. ఆయన సంగీతం సినిమాను కాపాడుతుంది తప్ప ఎక్కడా విమర్శల పాలవదు. ఆయన కుటుంబం నుండి ఇప్పుడు పలువురు సినీ రంగంలో వివిధ విభాగాల్లో సెటిలవుతున్నారు. ఇంతవరకూ ఎక్కడ ఫెయిల్యూర్ అనే మాటే లేదు. కానీ శ్రీసింహ విషయంలో అది జరిగింది.

రాజమౌళి కుటుంబం నుండి శ్రీసింహ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ‘మత్తువదలరా’ మంచి విజయాన్ని అందుకుంది. అది చూశాక ఎంతైనా జక్కన్న కుటుంబం కదా విజయం వాళ్లకు తథ్యం అనుకున్నారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో శ్రీసింహనే స్వయంగా కథలు వినడం, సెలెక్ట్ చేసుకోవడం చేశారు. అలా ఆయన చూజ్ చేసుకున్న కథే ‘తెల్లవారితే గురువారం’. ఈ సినిమా మీద సింహ మంచి హోప్స్ పెట్టుకున్నాడు. రాజమౌళి సైతం ఎన్టీఆర్ ను తీసుకొచ్చి ప్రమోషన్లు చేయించారు. వారాహి బ్యానర్ కాబట్టి పాజిటివిటీ ఇంకా పెరిగింది.

కానీ విడుదలయ్యాక చూస్తే సినిమాకు నెగెటివ్ టాక్ మొదలైంది. సాయంత్రానికి సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు. ఇప్పటివరకు రాజమౌళి కాంపౌండ్లో ఇదే పెద్ద ఫెయిల్యూర్. అందుకే కుటుంబం మొత్తం సింహ కథల మీద దృష్టి పెట్టారట. ఇంతకుముందులా కాకుండా ఇకపై సింహ కథలను పెద్దలు కూడ వినాలని డిసైడ్ అయ్యారట. తరువాతి సినిమాల కథలు పక్కాగా ఉండేలా చూడాలనుకుంటున్నారట.