Y.S.jagan: ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో భాగంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీట్ అధికారులు అరెస్టు చేసే విచారణ చేపట్టారు అయితే ఈ విచారణలో భాగంగా సంచలన విషయాలను వెల్లడించారు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం మేరకు ఈ వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డి కను సన్నల్లోనే జరిగిందని తెలుస్తుంది.
లిక్కర్ వ్యవహారం మొత్తం జగన్ కనుసన్నల్లోనే నడిచిందని.. జగన్ చెప్తేనే తాను ఈ విషయంలో పాత్రధారిగా ఉన్నానంటూ ఈయన సంచలన విషయాలను తెలిపారు. జగన్ ఆదేశించడంతో మేము ఆచరించామని తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించాం. జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు చాలా మందికి ఇందులో పాత్ర ఉందనీ కసిరెడ్డి సిట్ అధికారుల విచారణలో తెలిపారు.
ఇన్ని రోజులు దుబాయిలో ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దుబాయ్ నుంచి ఇండియాకు రాగానే సీట్ అధికారులు తనని వెంటనే అరెస్టు చేయడం ఆ తర్వాత విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో కసిరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఇక ఈ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఎంతోమంది నేతల ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. ఇది మొత్తంగా లిక్కర్ వ్యవహారంలో కసిరెడ్డి పాత్ర. మొత్తం 29 మంది నిందితులు ఉన్న ఈ కేసులో కసిరెడ్డి ఏ1గా ఉన్నాడు. ఏ4గా ఎంపీ మిథున్ రెడ్డి, ఏ5గా విజయ్సాయి రెడ్డి ఉన్నారు.