పేపర్ షో చేస్తున్న రఘురామ

ragurama

 2019 లో వైసీపీ తరుపున గెలిచి ఆ తర్వాత అదే పార్టీకి రెబల్ ఎంపీ గా మారిన రఘురామ కృష్ణం రాజుకు వైసీపీ గట్టి షాక్ ఇస్తూ సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుండి తొలిగించారు. నన్ను ఎవరు పదవి నుండి తొలిగించలేరంటూ గొప్పలు చెప్పుకున్న రఘురామ కు ఈ చర్య గట్టి షాక్ అనే చెప్పాలి. అదే సమయంలో ఆయన ఇంటిపై సిబిఐ దాడులు జరగటంతో రఘురామ లో అసహనం పెరిగిపోయింది.

ragurama

  దీనితో రోజు ఎదో ఒక టాపిక్ తీసుకోని వచ్చి వైసీపీ మీద జగన్ మీద విమర్శలు చేయటం పనిగా పెట్టుకున్నాడు. తనపై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లకు కౌంటర్ లు ఇస్తూ కాలం గడుపుతున్నాడు. రఘురామ కృష్ణం రాజు నైజం తెలుసుకున్న వైసీపీ నేతలు చాలా తెలివిగా ఆయన్ని విమర్శించటమే మానేశారు. కనీసం ఆయన పేరు కుడా ఎక్కడ ప్రస్తావన రాకుండా చూసుకుంటున్నారు . దీనితో రఘురామ మాట్లాడటానికి టాపిక్ అంటూ లేకుండాపోయింది. అయితే “రోడ్డెక్కిన భామకు ఊరంతా బావలే” అన్నట్లు విమర్శించటమే లక్ష్యంగా పెట్టుకున్న రాజుగారికి టాపిక్ లేకుండా ఎందుకు ఉంటుంది.

  ప్రతిరోజూ సాక్షి పేపర్ లో వచ్చే న్యూస్ ను చదవటం, దానిపై తనదైన శైలిలో విశ్లేషణ చేయటం, సాక్షి ఒక అబద్దాల పత్రికని, అందులో రాసేవాణ్ణి పచ్చి అబద్దాలు అంటూ ఒక వీడియో చేసి, తనకు అనుకూలమైన మీడియాకు దానిని పంపించటంతో, లేక వాళ్లనే పిలిపించుకొని టిఫిన్లు గట్రాలు తినిపించి సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు రాఘురామ కృష్ణంరాజు. అదే విధంగా చిన్న చిన్న యూట్యూబ్ చానెల్స్ కు పిలిచి మరి ఇంటర్వ్యూ లు ఇస్తూ తన నోటి దూల తీర్చుకుంటున్నాడు రాజు గారు. ఒక ఎంపీ స్థానంలో వుంటూ, ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేయగలికే సత్తా వున్నా రాజు గారు ఇలా ప్రతి రోజు పేపర్ షో చేస్తూ మీడియాలో హడావిడి చేయటం ఏమిటో ఆయనకే తెలియాలి.