వైరల్ : సినీ వర్గాల్లో సర్క్యులేట్ అవుతున్న పూరి జగన్నాధ్ సంచలన లేఖ.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఒకరు. కాదు ఒకే ఒక్కడు అని చెప్పాలి. తన కెరీర్ లో చూడని ప్లాప్ లేదు చూడని భారీ హిట్ కూడా లేదు. మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ పూరి జగన్నాథ్ కెరీర్ లో గడ్డు కాలంలోకి వెళ్ళాడు. దీనితో ఇప్పుడు పూరి జగన్నాథ్ అయితే తాను ఎదుర్కొంటున్న ఇష్యూస్ పై రిలీజ్ చేసిన ఓ లేఖ ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

లైగర్ సినిమా ఫలితం తర్వాత పూరి క్యాజువల్ గానే ఈ సినిమా ఫలితాన్ని కూడా తీసుకున్నాడు. కానీ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న ఒత్తిళ్లు చూసి అయితే ఇక పూరి జగన్నాట బరస్ట్ అవ్వక తప్పలేదు. దాని నుంచే ఓ స్ట్రాంగ్ ప్రెస్ నోట్ లాంటిది తన నుంచి బయటకి రాగా ఇది ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.

మరి తాను ఏం చెప్తున్నది ఏమిటంటే..

“సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండూ వేరువేరు అనుకుంటాం, కాదు. ఈ రెండూ ఫ్లో లో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక తర్వాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే  . ఇక్కడ ఏదీ పర్మనంట్ కాదు.. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక అనుభవం లా చూడాలి తప్ప, ఫెయిల్యూర్ సక్సెస్ గా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు.. ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. సో ఎప్పుడూ మనం మెంటల్ గా ఫైనాన్సియల్ గా ఎదుగుతూనే అవుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్ గా చూడొద్దు – చెడు జరిగితే మన చుట్టూ ఉన్న చెడ్డవాళ్ళు మాయమైపోతారు.. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి.. అది రిస్క్ అవ్వాలి. లైఫ్ లో రిస్క్ చెయ్యకపోతే అది లైఫీ కాదు. ఏ రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్. లైఫ్ లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు. నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ క్లాప్స్ కొడతారు, అక్షింతలు వేస్తారు. సో ఇవన్నీ మీ లైఫ్ లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరో లా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. ఎవరినుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియెన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. నిజానికి నేను ఆడియెన్స్ కి మాత్రం జవాబు చెప్పాల్సి ఉంది. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా, వాళ్ళని ఎంటర్టైనర్ చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి.. తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా.. మీ పూరి జగన్నాథ్”. అంటూ పూరి అయితే ఓ స్టన్నింగ్ లెటర్ తో ముగించాడు.