ఇద్దరు కాదు నలుగురికి పునీత్ రాజ్ కుమార్ కళ్ళు.!

జస్ట్ గత కొద్ది రోజులు కితమే దక్షిణాది సినిమా దగ్గర తీరని లోటు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా యుక్త వయస్సు లోనే కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం చెంది అభిమానులును టాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా శోక సంద్రంలోకి నెట్టేశారు. అయితే ఆ తర్వాతనే అసలు పునీత్ ఎంత గొప్ప మనిషో అందరికీ తెలిసింది. ఎంతోమందికి చదువు, అనాదాశ్రమాలు ఎన్నో సాయాలు పునీత్ చేసాడు.

అంతేకాకుండా తన మరణం తర్వాత కూడా తన నేత్రాలు దానం చేసి చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే పునీత్ నేత్రాలుతో కేవలం ఇద్దరికీ కాకుండా నలుగురికి వైద్యులు చూపు వచ్చేలా చేశారట. పునీత్ రెండు నేత్రాల నుంచి కర్నియా పొరను నాలుగు భాగాలుగా విభజించి కర్నియా సంబంధిత అంధులు నాలుగురుకి పెట్టి వారికి వెలుగును ప్రసాదించారట. దీనితో పునీత్ మరోసారి నిజ జీవితంలో హీరోగా నిలిచిపోయారు.