Natti Kumar: తాజాగా టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ మరణించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ తాజాగా పరిస్థితి విషమించడంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన హాస్పటల్లో చికిత్స పొందుతున్న సమయంలో టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు సహాయం చేసిఆయన హాస్పటల్లో చికిత్స పొందుతున్న సమయంలో టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు సహాయం చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ అవాస్తవాలుగా మిగిలిపోయాయి. ఇకపోతే ఫిష్ వెంకట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో నెటిజన్స్ మండిపడిన విషయం తెలిసిందే.
అలాగే ఆయన మరణం తర్వాత సినీ పరిశ్రమపై విమర్శలు వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సహాయం కోసం ఆయన కుటుంబం అభ్యర్తించారు. కానీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదని నెటిజన్లు తప్పుబట్టారు. మరణించినా కూడా ఆ కుటుంబానికి సానుభూతి కూడా తెలపలేదని విమర్శించారు. ఒక ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు, సాంకేతిక నిపుణుడు చనిపోతేనే ఇండస్ట్రీ మొత్తం తరలి వస్తుంది. కానీ, చిన్న నటులు మరణిస్తే కనీసం సహాయం, స్పందన కూడా పరిశ్రమ నుంచి కనపించలేదని విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై తాజాగా నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంత కాలంగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు.
పరిశ్రమతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్న వారు మరణిస్తే ఈ సెలబ్రిటీలు అక్కడ కనిపిస్తారు. సినిమా అంటేనే ఒక బిజీ ప్రపంచం ఎవరి పనిలో వారు ఉంటారు. ఇక్కడ ఎవరు మరణించారు? అని తెలుసుకునేంత టైమ్ కూడా ఎవరికీ ఉండదు. నేను చెబుతున్న మాటలు ఫిష్ వెంకట్ ఫ్యామిలీతో పాటు ప్రేక్షకులకు కూడా బాధ ఉండవచ్చు. రేపు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చినా అంతే సినిమా పరిశ్రమలో కొన్ని సామాజిక వర్గాలు, ఫిలిం ఛాంబర్ తో నిత్యం టచ్ లో ఉన్నవారికి ఏదైనా జరిగితే వారి సన్నిహితులు తప్పకుండా వెళ్తారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ తో ఫిష్ వెంకట్ టచ్ లో ఉంటారు. కాబట్టి వారు ఆయనతో కనిపిస్తున్నారు. మిగిలిన వారు ఎవరూ అయ్యోపాపం అని కూడా అనరు. వెంకట్ను ఎవరూ పలకరించలేదని చాలామందికి బాధ ఉండవచ్చు.
మొదట ఆయన అసోషియేషన్ మెంబర్ కాదు. సభ్యత్వం కూడా తీసుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో సహాయం చేస్తారని ఎవరూ ఆశించకండి. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే. వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తారని ఎదురుచూడకండి. రోజుకు రూ.3వేల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నుంచి రూ. 30 వేలు తీసుకునే రేంజ్ కు కూడా వెంకట్ చేరుకున్నాడు. మన దగ్గరకు డబ్బు వచ్చినప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ఎవరూ సాయం చేస్తామని ముందుకు రారు. ఈ విషయంలో ఒకరిని తప్పుబట్టడం ఎందుకు? లేనివాడికి ప్రాణం మీద ప్రేమ, ఉన్నవాడికి డబ్బు మీద ప్రేమ. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకోవాలి. మాట సాయం చేయగలరేమో కానీ, ఆర్ధిక సహాయాలు అందరూ చేయరు అని నట్టి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేరే లెవ్వడంతో కొంతమంది తప్పు పడుతుండగా మరికొందరు ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా అంటూ సమర్థిస్తున్నారు.
Natti Kumar: ఫిష్ వెంకట్కు ఎందుకు సహాయం చేయాలి.. నిర్మాత నట్టి కుమార్ కామెంట్స్ వైరల్!
