‎Mithra Mandali: ఏంటి.. మిత్రమండలి థియేట్రికల్ బిజినెస్ అంతేనా.. విడుదల తర్వాత పరిస్థితి ఏంటో?

Mithra Mandali: విజయేందర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ మిత్రమండలి. ఇందులో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక NM కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా పాటలు టీజర్ ట్రైలర్ ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

‎అయితే మరికొన్ని గంటల్లో అనగా అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మిత్ర మండలి సినిమా రేపు అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండగా నేడు రాత్రికే ప్రీమియర్స్ వేసేస్తున్నారు. కాగా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారట డైరెక్టర్. మిత్ర మండలి సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించారని టాక్. దీంతో ఆల్రెడీ నాన్ థియేటరికల్ ఓటీటీ బిజినెస్ కూడా అయిపోయిందని తెలిపారు నిర్మాతలు.

‎అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా సింపుల్ గా జరిగిందట. మిత్ర మండలి సినిమా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ అన్ని కలుపుకొని 5 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం. ఈ లెక్కన మిత్ర మండలి సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 6 కోట్ల షేర్, అంటే ఆల్మోస్ట్ 12 కోట్ల గ్రాస్ రావాలి. కామెడీ సినిమా కావడం, ముందే ప్రీమియర్స్ వేయడం, దీపావళి సీజన్ కావడంతో ఈజీగానే కలెక్ట్ చేసి హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి. అయితే కమెడియన్ ప్రియదర్శి ఈ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరీ.