Modi: సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైన ఎక్కడికి వెళ్లిన వారి ప్రత్యర్థుల గురించి విమర్శలు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఏ రాష్ట్రానికి వెళ్లిన అక్కడ ప్రత్యర్థి పై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా తమిళనాడు వెళ్లిన కర్ణాటక వెళ్ళిన తెలంగాణ వెళ్ళినా సరే ప్రత్యర్థి పార్టీలపై, ప్రత్యర్థి నాయకుడి పై విమర్శలు కురిపిస్తూ వచ్చారు.
ఇకపోతే జగన్మోహన్ రెడ్డికి మోడీ మధ్య ఏ విధమైనటువంటి శత్రుత్వం లేదని తెలుస్తోంది. గతంలో మోడీ ప్రభుత్వానికి జగన్ చాలా సానుకూలంగా ఉన్నారు. జగన్ తో పోటీకి సై అంటే ఆయన ఎంత దూరమైనా వెళ్తారని అందుకే మోడీ జగన్ తో చాలా సాన్నిహితంగా ఉన్నారు.
2019 సమయంలో ప్రధాని రెండోసారి మోడీ అయిన తర్వాత కూడా ఏపీకి వచ్చిన సమయంలో చంద్రబాబు గురించి విమర్శలు చేశారు కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించినప్పటికీ జగన్ మీద ఎక్కడ కూడా ఒక నెగిటివ్ కామెంట్లు చేయకపోవడంతో కూటమినేతలు షాక్ అవుతున్నారు. జగన్ పై మోడీ విమర్శలు చేస్తే చూడాలని భావించిన కూటమినేతల కల కలగానే మిగిలిపోయింది.జగన్ పై ఎందుకు నేరుగా మోదీ ఆరోపణలు చేయలేకపోయారన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
జగన్ కూడా అన్ని రకాలుగా మోదీ ప్రభుత్వానికి పరోక్షంగానైనా సహకరిస్తున్నారు. ఈ సమయంలో జగన్ పై విమర్శలు చేయకుండానే తన ప్రసంగాన్ని ముగించి ప్రధాని వెళ్లిపోయారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి కానీ కూటమినేతలు మాత్రం వారిని వారు సంతృప్తి పరచుకోవడానికి జగన్ ను మోడీ పెద్దగా పట్టించుకోలేదని అందుకే ఆయన గురించి ఎక్కడ మాట్లాడటం లేదని వారికి వారు సర్ది చెప్పుకుంటున్నారు.