Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొననున్నా దీపికా… అమితాబ్!

Project K: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్ధమవగా.. ‘ఆదిపురుష్’ చిత్రీకరణ పూర్తయింది. అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న సలార్ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ కేవలం రెండు షెడ్యూల్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరొక సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈక్రమంలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పనులను ప్రారంభించగా కరోనా కారణం వల్ల ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పటికే హైదరాబాద్లో ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తదుపరి చిత్రాన్ని హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ అదేవిధంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే పాల్గొననున్నారు. ప్రభాస్, దీపిక, అమితాబ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.సుమారు 450 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో విజిటర్స్ ఎవరూ కూడా లొకేషన్ లోకి అడుగు పెట్టకుండా ఉండడం కోసం నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇలా ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాల్సి ఉంది.