టెలివిజన్ లోనూ డిజాస్టర్ గా నిలిచిన ప్రభాస్ రాధే శ్యామ్?

బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఎన్నో అంచనాల నడుమ నటి పూజా హెగ్డేతో కలిసి నటించిన రాదే శ్యామ్ తో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ గా నిలిచింది. ఈ విధంగా భారీ నష్టాలను చెవి చూసిన ఈ సినిమా అనంతరం ఓటీటీలో ప్రసారం అయ్యి అక్కడ కూడా అంతగా మంచి రెస్పాన్స్ ఏమీ సాధించలేదు. ఓటీటీలో కూడా డిజాస్టర్ అయినా ఈ సినిమా చివరికి టెలివిజన్ లో ప్రసారమైంది.

అయితే బుల్లితెరపై ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయలేకపోయింది.సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లో డిజాస్టర్ గా నిలిచిన టెలివిజన్ లో మాత్రం సూపర్ రెస్పాన్స్ అందుకుంటాయి. కానీ ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా టెలివిజన్లో అలాంటి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు.అయితే ఈ సినిమా టెలివిజన్ లో కూడా పెద్దగా రేటింగ్ కైవసం చేసుకోలేకపోయింది.

ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకి వచ్చిన ఆదరణ కూడా ప్రభాస్ సినిమాకి రాకపోవడం గమనార్హం. ఇటీవల జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమా 8.25 రేటింగ్ మాత్రమే కైవసం చేసుకుంది.ప్రభాస్ సినిమా అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే ఈ సినిమా మాత్రం చాలా తక్కువ రేటింగ్ కైవసం చేసుకుంది. ఏది ఏమైనా ప్రభాస్ కెరియర్లో ఈ సినిమా భారీ డిజాస్టర్ అని చెప్పాలి.