అందరూ భయపడినా ప్రభాస్ మాత్రం నిలబడ్డాడు

Prabhas in non stop shooting mode

Prabhas in non stop shooting mode

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు పెద్ద సినిమాలన్నీ ప్యాకప్ చెప్పుకుంటున్నాయి. ‘సర్కారు వారి పాట’ సెట్లో కోవిద్ కలకలం రేగడంతో మహేష్ బాబు షూటింగ్ ఆపేశారు. ఇక కేసులు పెరుగుతుండటం, చిత్రంలోని కీలక నటుడు సోనూ సూద్ కరోనాకు గురికావడంతో మెగాస్టార్ చిరంజీవి కూడ ‘ఆచార్య’ చిత్రీకరణకు బ్రేకులు వేశారు. గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ఆగినట్టు తెలుస్తోంది. రానున్న వారం పది రోజుల్లో మొదలుకావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. రేపోమాపో ఇంకొన్ని చిత్రాలు నిలిచిపోనున్నాయి. ఇలా హీరోలంతా ఎవరికి వారు స్వచ్ఛందంగా షూటింగ్స్ ఆపుకుంటూ ఉంటే ప్రభాస్ మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు.

ప్రజెంట్ ఆయన ‘రాధేశ్యామ్, ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నారు. ‘రాధేశ్యామ్’ కొద్ది షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇంకో వారం పది రోజులు చేస్తే పూర్తైపోతుంది. ప్రభాస్ బృందం మాత్రం కరోనాకు బెదరకుండా ధైర్యం చేసి షూటింగ్ నడిపిస్తున్నారు. పూర్తయ్యాకనే ప్యాకప్ చెప్పాలని అనుకుంటున్నారు. ఇదే కాదు ‘ఆదిపురుష్’ కూడ నడుస్తోంది. ముంబైలో కేసులు విపరీతంగా ఉన్నా, అక్కడ స్టార్ హీరోలు సైలెంట్ అయినా ప్రభాస్ మాత్రం నిర్విరామంగా పనిచేస్తున్నారు. ‘రాధేశ్యామ్’ ముగియగానే ఆయన ‘ఆదిపురుష్’ కోసం ముంబై వెళ్ళిపోతారు. నిబంధనల మధ్యన అయినా మెల్లగా షూటింగ్ నడుపుతారట. మొత్తానికి ప్రభాస్ కోవిడ్ సమయంలో ధైర్యంగా నిలబడుతున్నాడు.