బాలీవుడ్ నిర్మాతతో ఒకే వేదికపై ముచ్చటించనున్న ప్రభాస్, అల్లు అర్జున్?

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరినీ కలిపి ఒకే వేదికపై చూడాలని ఎంతో మంది అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించడంతో వారి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలందరూ పాన్ ఇండియా స్టార్లు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్, త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్, రామ్ చరణ్, పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ ఇలా ఎంతోమంది పాన్ ఇండియా స్టార్ లుగా గుర్తింపు పొందారు.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ లో కూడా పాపులారిటీ పెరగటంతో వారు భవిష్యత్తులో తీయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ , బన్నీ ఒకే వేదికపై కనిపించనున్నారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో కాఫీ విత్ కరణ్. ఈ షో ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ షో ని హోస్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో తొందర్లోనే 7 సీజన్ ప్రారంభం కానుంది. అయితే గడిచిన ఆరు సీజన్లు బుల్లితెర మీద ప్రసారమయ్యాయి. కానీ ఏడవ సీజన్ మాత్రం బుల్లితెర మీద కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ ఏడవ సీజన్ లో టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించనున్నరని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడవ సీజన్ లో దక్షిణాది తారలు ఎక్కువగా కరణ్ తో ముచ్చటించనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బన్నీ ఈ వేదికపై కలసి కనిపించనున్నారు అని ,ఈ షో ద్వారా వారిద్దరి మద్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలివేట్ చేయనున్నారు అని సమాచారం.

బాలీవుడ్ లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ షో ఇప్పుడు దక్షిణాది తారలు రావడంతో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. కరణ్ ఆహ్వానిస్తే మన హీరోలకు ఈ షో కి రావటానికి ఒప్పుకుంటారా? లేదా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. బన్నీ, ప్రభాస్ ని ఓకే వేదికపై చూడాలని వారి అభిమానులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బన్నీ అప్పుడప్పుడు ఇటువంటి షోలలో కనిపించాడు. కాని ప్రభాస్ మత్రం ఎప్పుడూ ఎటువంటి షో లకి దూరంగా ఉంటాడు. కరణ్ అడిగితే ప్రభాస్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి మరి.