సర్వ పాపాలను నివారించే హనుమ నామస్మరణం గురించి ఈ విషయాలు తెలుసా?

మనలో చాలామంది ఇష్టంగా పూజించే దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరనే సంగతి తెలిసిందే. వేర్వేరు రూపాలలో ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. హనుమంతుని అనుగ్రహం కలగడంతో పాటు మనం చేసిన సర్వ పాపాలు తొలగిపోవాలని అనుకుంటే సుందర కాండ పారాయణం చేయడం మంచిది. ఈ పారాయణం వల్ల మనకు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయి.

ఆంజనేయస్వామి యంత్రంను ఇంట్లో ఉంచి పూజించడం వల్ల మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా జీవనం సాగిస్తారు. సుందరకాండ పారాయణం చదివిన వాళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఏవైనా మానసిక సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా దూరమవుతాయి. ఇంట్లో తప్పనిసరిగా హనుమంతుని విగ్రహం లేదా ఫోటో ఉంటే అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి.

చదువుకునే విద్యార్థులు హనుమంతుడిని పూజిస్తే హనుమంతుని ఆశీస్సులు మనపై ఉంటాయి. మంగళవారం హనుమంతుడి గుడిని సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాను రోజూ ఉదయం సాయంత్రం స్మరించడం ద్వారా మంచి ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. హనుమంతుని ముందు మట్టి ప్రమిదలో దీపం వేసి పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

హనుమంతుని దేవాలయం ఉన్న ఊర్లపై కూడా ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది. సీతాదేవి హనుమంతుడు ఉన్న ప్రతి చోట సమస్త భోగ భాగ్యాలు కలుగుతాయని వరం ఇచ్చింది. ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి భూతప్రేత బాధలు, పిశాచాల బాధలు సైతం తొలగిపోతాయి. భక్తితో హనుమంతుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి.