Posani Krishna Murali: మందు, ముక్కలు అందించే బతుకు నాకొద్దు.. పోసాని షాకింగ్ కామెంట్స్!

Posani Krishna Murali: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ఆఫ్ ఇండియా సినిమా ఈనెల 18వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ రిలీజ్ వేడుకలో భాగంగా పోసాని కృష్ణ మురళి హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పోసాని ఎప్పటిలాగే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తను పరుచూరి బ్రదర్స్ దగ్గర పని చేశానని వారితో పని చేస్తున్న సమయంలోనే మోహన్ బాబుతో పరిచయం ఏర్పడిందని తెలియజేశారు.ఈ విధంగా పరుచూరిబ్రదర్స్ దగ్గర ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన తను ఇకపై ఇలాంటి జీవితం వద్దని అందుకే వారినుంచి విడిపోయానని తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో పరుచూరిబ్రదర్స్,వేటూరి, ఆత్రేయ వంటి వారిని చూసాను. వారు బతికిన బతుకు నాకొద్దు జీవితాంతం నా కొడుకు, నా మనవళ్ళు సంతోషంగా బతకడానికి సరిపోయేంత సంపాదించాను అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో కొంత మందికి మందు పోసి చికెన్ ముక్కలు అందించే బతుకు తనకు వద్దని పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.పోసాని ఈ విధంగా మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇండస్ట్రీలో కొందరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. అయితే మోహన్ బాబుకు చిరంజీవి కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పోసాని మోహన్ బాబు సినిమా ఫంక్షన్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.