పూజా హెగ్డేకు సాదర స్వాగతం పలికిన జనగణమన టీమ్… వీడియో వైరల్!

పూజా హెగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుండగా, పూరిజగన్నాథ్ విజయ్ దేవరకొండ జనగణమన సినిమాలో కూడా నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేస్తూ జనగణమన సినిమాకు పూజా హెగ్డేకు స్వాగతం పలికారు.ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో విజయ్ దేవరకొండ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ముంబైలో విజయ్ దేవరకొండ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత చిత్రబృందం హైదరాబాదులో తదుపరి షూటింగ్ పనులను ప్రారంభించనుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల కావడంతో ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసి ఈ సినిమాని 2023 ఆగస్టు 3వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. ఇకపోతే ఈ సినిమాను పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఛార్మి కౌర్ – దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

YouTube video player

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను ముంబైలో ప్రారంభించారు.ఇకపోతే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ సమంతతో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.