Pooja hedge: ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ అంతా ఫేక్… నోరు జారిన బుట్ట బొమ్మ… షాక్ లో ఫ్యాన్స్!

Pooja hedge: పూజా హెగ్డే ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె తమిళంలో నటుడు సూర్యతో కలిసి నటించిన రెట్రో సినిమా మే 1వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఉండే ఫాలోవర్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా ఫేస్బుక్ లేదా ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇలా మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ హీరోయిన్లకు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫాలోవర్స్ గురించి పూజా హెగ్డే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నాకు ఇన్ స్టాగ్రామ్ లో 38 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ నా సినిమాని అంతమంది ఆడియన్స్ థియేటర్స్ లో చూడరు. నాకు ఉన్నటువంటి ఫాలోవర్లు పెద్దపెద్ద స్టార్స్ కి కూడా లేరు. నాకు మాత్రమే కాదు ఎంతోమంది హీరోయిన్లకు ఇలా బిగ్గెస్ట్ స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. వాళ్లంతా నిజమైన అభిమానులు కాదు. కేవలం మేము పెట్టే కంటెంట్ ని బట్టి వచ్చే వాళ్ళు వాళ్లంతా అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా పూజ హెగ్డే ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారంతా నిజం కాదని ఫేక్ అంటూ చెప్పటంతో దీనిని క్రికెట్ అభిమానులు, మరియు ఇతర హీరోల అభిమానులు తమ అభిమాన సెలబ్రిటీని మరో సెలబ్రిటీతో పోలుస్తూ కొంతమంది ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ ని చూసి ఏవేవో ఊహించుకున్నాం కదా అసలు నిజం ఇదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఫాలోవర్స్ గురించి పూజ హెగ్డే చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.