Pooja Hegde: నూతన గృహ ప్రవేశం చేసిన పూజా హెగ్డే.. తన కల నెరవేరిందంటూ ఇన్స్పైరింగ్ పోస్ట్..!

Pooja Hegde: పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ సినిమాలో నటించింది. వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో ప్రభాస్- పూజ హెగ్డే జోడి చూడముచ్చటగా ఉంది. తాజాగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తన కల నెరవేరింది అంటూ.. ఇన్స్పైరింగ్ పోస్ట్ చేసింది.

ఇటీవల పూజా హెగ్డే ముంబైలో ఇంటిని నిర్మించుకుంది. ఆ ఇంటి నిర్మాణానికి దాదాపు ఏడాది కాలం పట్టిందట. తాజాగా పూజా హెగ్డే గృహప్రవేశం చేసి ఒక ఇంటిది అయ్యింది. గృహప్రవేశం సందర్భంగా పూజా హెగ్డే పూజలో పాల్గొన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో లో పూజ హెగ్డే మంచి ట్రెడిషనల్ లుక్ లో బుట్ట బొమ్మలా కనిపిస్తుంది. ఫోటో షేర్ చేస్తూ పూజ ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మన కళలు నెరవేరాలంటే మనమీద మనకి నమ్మకం నుండి కష్టపడి పని చేసినప్పుడే మన కళ్ళలో నెరవేరుతాయని కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఈ సందర్భంగా పూజ పోస్ట్ చేసింది.

సినిమాలతో బిజీబిజీగా ఉండే ఈమె తాజాగా మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లి రిలాక్స్ అయ్యింది. మాల్దీవ్స్ లో ఈ అమ్మడు బికినీతో సముద్రంలో జలకాలాడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇలా పూజా హెగ్డే తన అందంతో కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే పూజా హెగ్డే ప్రభాస్ తో మొదటిసారి రాధే శ్యామ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. అటు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య సినిమాలో పూజా హెగ్డే కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ అమ్మడు బిజీ బిజీగా ఉన్నారు.