Pooja Hegde: వరుస ఫ్లాప్ లు వచ్చిన కూడ అరుదైన ఆహ్వానం పొందిన బుట్టబొమ్మ..!

Pooja Hegde: ముకుందా సినిమా ద్వారా పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తర్వాత నాగచైతన్య హీరోగా నటించడం ఒక లైలా కోసం అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. కెరీర్ బిగినింగ్ లో వరస ఫ్లాపులు వచ్చినా కూడా పూజా హెగ్డే కి అవకాశాలు మాత్రం తగ్గలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న పూజ అటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది.

బాలీవుడ్లో కూడా ప్రముఖ స్టార్ హీరోల సరసన నటించిన పూజ ప్రస్తుతం మరొక భారీ సినిమాలో నటిస్తోంది. ఇటీవల పూజ నటించిన ఆచార్య, రాధేశ్యాం, బీస్ట్ సినిమాలు ప్లాప్ అవటంతో ఈ అమ్మడు కొంచం నిరాశ చెందింది. దీంతో అందరు ఈ ముద్దుగుమ్మ ను ఐరన్ లెగ్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతము పూజ తెలుగులో మహేష్, పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమాలు కూడ హీట్ అవ్వకపోతే ఇండస్ట్రీలో పూజ కి ఆఫర్స్ తగ్గడం ఖాయం. ఇదిలా ఉండగా ఇటీవల పూజ కి ఒక అరుదైన ఆహ్వానం అందింది.

సినిమాలు ప్లాఫ్ అవ్వటంతో నిరాశగా ఉన్న పూజ కి 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో పూజ హెగ్డే ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ నెల 17 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనటానికి ప్రముఖ బాలీవుడ్ నటులతో పాటు తనకి కూడ ఆహ్వానం అందటంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ నెల 17, 18 తేదీలలో పూజ కేన్స్‌ వేదిక మీద సందడి చేయనుంది.