మండుటెండలో ఐస్ క్రీమ్ తింటూ రచ్చ చేస్తున్న పూజ హెగ్డే.. ఫోటో వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రనటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నప్పటికీ ఏ మాత్రం తన కెరియర్ పై ప్రభావం చూపకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పూజాహెగ్డే వరుస సినిమాలు ఈవెంట్లు అంటూ బాగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఈమె తన త్రో బ్యాక్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా వైట్ సాండ్ బీచ్ లో మండుటెండలో చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటూ ఈమె ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నీలిరంగు స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి గోధుమ రంగు హ్యాట్ ధరించి ఎంతో క్యూట్ గా ఉన్న ఈ ఫోటోని షేర్ చేస్తూ వైట్ సాండీ బీచ్ లో మనస్ఫూర్తిగా చల్లటి పానీయం తీసుకుంటూ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూస్తుంటే త్వరలోనే పూజా హెగ్డే మరో హాలిడే వెకేషన్ వెళ్లేలా ఉంది అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె కెరీర్ విషయానికి వస్తే పూజా హెగ్డే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఇదివరకే మహేష్ బాబు సరసన నటించిన మహర్షి సినిమా మంచి విజయం అందుకోవడంతో తిరిగి మహేష్ బాబుతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ జనగణమన సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం. ఈమెకు ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్స్ వచ్చినప్పటికీ తన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదని తెలుస్తోంది.