ఇష్ట‌మైన వారిని ప‌రిచ‌యం చేసిన పూజా హెగ్డే.. అభిమానులు షాక్!

అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం త‌ర్వాత పూజా హెగ్డే సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌గా మారింది. ఈ అమ్మ‌డికి తెలుగు, త‌మిళం, హిందీ భాషల‌లో అనేక ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో పూజా హెగ్డే త‌న న‌ట‌న‌తో పాటు అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేసింది. ఇక త్వ‌ర‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అఖిల్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.

మ‌రోవైపు పూజా హెగ్డే న‌టించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో పూజా .. ప్రేర‌ణ అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు పూజా హెగ్డే ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌నే టాక్స్ వినిపిస్తుండ‌గా, దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

పూజా రీసెంట్‌గా ముంబైలో ఓ ఫ్లాట్ కొన్నద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ ఇంట్లో సేద‌తీరుతుంద‌ట ఈ అందాల ముద్దుగుమ్మ‌. పూజా కొత్త ఇంట్లో మూడు బెడ్ రూంస్, హాల్, స్విమ్మింగ్ పూల్‌తో పాటు లాన్ ఉండ‌నున్నాయ‌ట‌. ఇక్క‌డి వాతావ‌ర‌ణం చాలా ఆహ్ల‌ద‌క‌రంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే వీలు చిక్కిన‌ప్పుడల్లా పలు ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. నెటిజ‌న్స్‌కు థ్రిల్ అందిస్తూ ఉంటుంది. తాజాగా త‌న పెంపుడు కుక్క‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. న‌చ్చిన వాడితో సేద‌తీరుతున్నా అనే కామెంట్ పెట్టింది.